హైదరాబాద్ : వాటాల అమ్మకంపై ఏర్పడిన వివాదానికి సంబంధించి టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఏబీసీఎల్ వాటాల అమ్మకంపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో రవి ప్రకాశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ జరుగకుండా టీవీ9ను చేజిక్కించుకున్న అలంద మీడియా జులై 9 వరకు స్టే తెచ్చుకుంది. దీంతో ఎన్సీఎల్టీ విచారణను జులై 12కు వాయిదా వేసింది. చింతలపాటి, ఐల్యాబ్ వాటాలను అలంద మీడియాకు విక్రయించడం సరికాదని ఈ నెల 9న రవి ప్రకాశ్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ, వాదనలు వినిపించాల్సిందిగా నోటీసులు జారీ చేయగా, అలంద మీడియా హైకోర్టులో స్టే తెచ్చుకుంది.