కరకుగా,కఠినంగా కనిపించే ఖాకీలకు కూడా ఖాకీ వెనెక కరుణ కలిగిన మనసులు ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ నిరూపించారు.విధి నిర్వహణలో మరణించిన తోటి ఖాకీపట్ల కమిషనర్ సజ్జనార్ వ్యవహరించిన తీరును ప్రతీఒక్కరూ ప్రశంసిస్తున్నారు.ఓ కేసుకు సంబంధించి నిందితులు బిహార్లో ఉన్నట్లు తెలుసుకున్న తెలంగాణ పోలీసుల బృందం బిహార్ రాష్ట్రానికి వెళ్లింది.తిరిగి తెలంగాణకు వస్తుండగా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో మైలార్దేవరపల్లి పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ తులసీరామ్ మృతి చెందారు.విధి నిర్వహణలో తులసీరామ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కమిషనర్ సజ్జనార్ చలించిపోయారు. తులసీరామ్ అంత్యక్రియల్లో పాల్గొన్న సజ్జనార్ తులసీరామ్ పాడెను భుజాలపై మోసి తోటి ఉద్యోగిపై తమ దృక్పథాన్ని చాటుకున్నారు.విధి నిర్వహణలో మృతి చెందిన తులసీరామ్ను తీసుకురాలేకమని అయితే తులసీరామ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.సజ్జనార్తో పాటు షీ టీమ్ డీసీపీ అనసూయ,ఏసీపీ అశోక్,ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ తదితరులు తులసీరామ్ భౌతికకాయానికి నివాళులర్పించారు..