పవన్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదు

పవన్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదు

అమరావతి : శాసనసభ ఎన్నికల్లో పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత తులసి రెడ్డి మండి పడ్డారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తోంది. అ లాంటి పార్టీతో 100 శాతం పవన్ పొత్తు కుదుర్చు కుంటున్నారు. ప్రజల కోసమే ఈ పొత్తులు పెట్టుకుంటున్నామనటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. . పొత్తుల విషయంలో పవన్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదు. ఏపీకి నంబర్ వన్ ద్రోహి బీజేపీ. నంబర్ టూ ద్రోహి వైసీపీ. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సాయం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింద’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం