అన్ని టీటీడీ కళాశాలల్లో విద్యార్థి వసతి భవనాల నిర్మాణం

అన్ని టీటీడీ కళాశాలల్లో విద్యార్థి వసతి  భవనాల నిర్మాణం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.
ఇతర తీర్మానాలు..
*2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు చేసింది.
*యాత్రి సముదాయంలో లిఫ్ట్ల ఏర్పాటుకు 1.88 కోట్లు
*బాలాజినగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటు.
*రూ.14 కోట్లతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ..
*గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం ఏర్పాటు.
*ఐటీ సేవల కొసం 12కోట్ల నిధులు మంజూరు..
*శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం..
*రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం

తాజా సమాచారం

Latest Posts

Featured Videos