ఒకే సారి వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవు

ఒకే సారి వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవు

తిరుమల : లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత భక్తులకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఇక్కడ తెలిపారు. అయితే, గతంలోలా వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవని వివరించారు. కొంత కాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. క్యూలైన్లలో ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతిక దూరాన్ని పాటించేలా చూస్తామని వివరించారు. మాస్కులు, శాని టైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తాజా సమాచారం