నినాదాలతో హోరెత్తిన సభ

నినాదాలతో హోరెత్తిన సభ

అమరావతి: సభ సజావుగా సాగకుండా తరచూ అడ్డు తగిలిన తెదేపా సభ్యుతలపై సభాపతి తమ్మినేని సీతారాం తీవ్రంగా ఆగ్రహించారు. బుధవారం సభా ఆరంభమైన వెంటనే రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభమైంది. తెదేపా సభ్యులు జై అమరా వతి నినాదాలు చేస్తూ, సభ మధ్య భాగంలోకి దూసుకెళ్లారు. ఆందోళన చేయకుండా సంయనమనంతో వ్యవహరించాలని ఆయన చేసిన వినతుల్ని పట్టించుకోకుండా తెదేపా సభ్యులు నినాదాల్ని కొనసాగించారు. దీంతో ఆయన తన స్థానం నుంచి లేచి నిలుచుకుని ‘ఇదేమిటని’ మండి పడ్డారు. ఒక దశలో తెదేపా సభ్యుడు ఏలూరి సాంబశివరావు స్పీకర్ ముందుకు దూసు కెళ్లారు. ఆయన్ను వైకాపా సభ్యుడు అడ్డుకున్నారు. సభలో ఎవరు దౌర్జ్యంగా ప్రవర్తిస్తు న్నారో జనం గమనిస్తున్నార న్నారు. ఇది మీ ఇల్లా లేక శాసనసభాని ధ్వజ మెత్తారు. విపక్ష సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమ’ని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos