తెలంగాణలో మీ పప్పులు ఉడకవ్..

తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్‌ బీజేపీ పార్టీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ..కర్ణాటక రాష్ట్రంలో ఉడికినట్లు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పప్పులు ఉడకవంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్రంలో చేసినట్టుగా డ్రామాలు చేయడం తెలంగాణలో సాధ్యం కాదన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డా హైద్రాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు మొత్తం అబద్దాలమయమని విమర్శలు గుప్పించారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119  స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో గెలుపొందిందని కేటీఆర్ ప్రశ్నించారు.  మెజార్టీ స్థానాల్లో బీజేపీ డిపాజిట్లను కోల్పోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా కూడ ప్రజలు బీజేపీని ఓడించారనన్నారు.తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి అమలు చేస్తోందని కేటీఆర్ సెటైర్లు వేశారు.తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు వంటి పథకాలను కేంద్రం ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos