పాకిస్థాన్ నెటిజన్‌కు చురకలంటించిన కేటీఆర్..

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ పార్టీలతో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు సైతం సుష్మా హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్‌ కూడా సుష్మ స్వరాజ్‌కు సంతాపం వ్యక్తం చేస్తూ గతంలో చిన్నమ్మతోకలసి దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.ఈ పోస్టుకు స్పందించిన పాకిస్తాన్కు చెందిన నెటిజన్.. కశ్మీర్పై భారత ప్రభుత్వ తీసుకున్న చర్యల ఫలితంగా ఆవిడ చనిపోయారనే ఉద్దేశాన్ని వ్యక్త పరుస్తూ.. నరకం ఎదురుచూస్తోందంటూ కామెంట్ చేశాడు. కామెంట్కు కేటీఆర్ ఘాటుగా స్పందించారు‘‘సుస్మాస్వరాజ్ ఆకస్మిక మృతిపై మీరు చేసిన కామెంట్ హాస్యాస్పదం. కామెంట్ మీ వక్రబుద్ధికి అద్దం పడుతోంది. మీ ప్రొఫైల్ చూస్తుంటే పాకిస్తాన్కు చెందినవారిలా ఉన్నారు. మీరు ఎవరైనా సరే.. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించటానికి కొంత ధైర్యం సంపాదించుకోగలరు’’ అని వ్యాఖ్యానించారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos