మాజీ మంత్రి,తెరాస నేత డీ.శ్రీనివాస్ త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ శ్రీనివాస్ తనయుడు,నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్ అనుచర వర్గానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్కు దిశానిర్దేశం చేసే నాయకుడు లేడని అర్వింద్ ఎద్దేవా చేశారు.తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కషాయ జెండా ఎగరడం తథ్యమన్నారు.ఇక జిల్లాకు నిజామాబాద్ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు.పేరులో నిజాం ఉండటం వల్ల నిజాంసాగర్ నిండటం లేదని…నిజాం షుగర్స్ మూత పడింది.. నిజామాబాద్ రైతులు బాగుపడటం లేదని పేర్కొన్నారు. దీనిని వెంటనే ఇందూరుగా మార్చాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తుందని అర్వింద్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370లను రద్దు చేసిన ప్రధాని మోడీ .. దేశంలో కామన్ సివిల్ కోడ్ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు..