హైదరాబాదు: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకే మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యుల సంఖ్య మొత్తం 16. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10న పూర్తికానుంది. ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్ పోటీ చేస్తున్నారు. మొత్తం వోటర్ల సంఖ్య 788.