అక్కినేని సమంత మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.కర్కురె సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సమంత కుర్కురె సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్పై ప్రజలు,అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు,విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.కుర్కురె యాడ్ ఫోటో పోస్ట్ చేసి ఫోటోతో పాటు కుర్కురె సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందని కుర్కురె 20వ వార్షికోత్సవం సందర్భంగా మరింత రుచికరంగా కుర్కురె మీ ముందుకు రాబోతుందంటూ సందేశం ట్వీట్ చేసింది.అంతే నెటిజన్లకు,ప్రజలకు ఒళ్లు మండిపోయి రీట్వీట్లతో సమంతపై విమర్శలు ఎక్కు పెట్టారు. కుర్కురెని కాల్చితే ప్లాస్టిక్ పదార్థాలు వస్తున్నాయని గతంలో ఆరోపణలు వినిపించాయి.చాలా వీడియోలు కూడా అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి కూడా.కుర్కురె వంటి జంక్ఫుడ్,కోకాకోలా వంటి శీతలపానీయాలు చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అటువంటి ప్రమాదకరమైన జంక్ఫుడ్ తయారు చేసే సంస్థకు ప్రచారకర్తగా ఉండడమే కాకుండా ప్రమాదకరమైన జంక్ఫుడ్లు తినమంటూ ప్రోత్సహించేలా పోస్ట్లు పెట్టడం ఏంటి కొంచెం కూడా సామాజిక బాధ్యత లేదా?కేవలం కుర్కురె ఇచ్చే డబ్బుల కోసం ఇటువంటి విషపూరిత ఆహారాన్ని తినాలంటూ పిల్లలను ప్రోత్సహిస్తావా?అంటూ నెటిజన్లు సమంత ఫైర్ అవుతున్నారు.గతంలో కూడా డ్రస్ల విషయంలో సమంతకు,అభిమానులకు మధ్య ట్విట్టర్ వార్ జరిగిన విషయం తెలిసిందే..