న్యూ ఢిల్లీ: ముస్లింలపై జరుగుతున్న దాడులు వంటి అనేక అంశాలను పక్కన పెట్టి ముమ్మారు తలాక్పైనే ఎందుకు తొందరపడుతున్నారని గురువారం లోక్సభలో ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. తలాక్ ముసాయిదా వల్ల మహిళలే ఎక్కువగా నష్ట పోతారని అభిప్రాయ పడ్డారు. ముస్లింలపై దాడులకు పాల్పడిన వారికి శిక్షలు ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. వివాహాల విషయంలో షరియత్ చట్టాల్లోనూ ఎన్నో నిబంధనలు ఉన్నాయని అసద్ చెప్పారు.