అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయంలో బదిలీలకు శ్రీకారం చుట్టారు. గత సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేసిన సతీశ్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, సీఎం కార్యదర్శులు గిరిజా శంకర్, రాజమౌళిలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరంతా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని అదేశాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ధనంజయ రెడ్డిని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమించారు.