వాళ్లకు మాత్రమే టికెట్ ఇచ్చారు

వాళ్లకు మాత్రమే టికెట్ ఇచ్చారు

న్యూఢిల్లీ: సమాజంలో అర్ధభాగం ఉన్న బీసీలకు అసెంబ్లీ సీట్లలో న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. బీసీలకు 34 సీట్లు ఇస్తానని పొలిటికల్ అఫైర్స్ కమిటీల్లో చెప్పారన్నారు. అధిష్టానం మీద నమ్మకం ఉంది బీసీలకు కూడా సీట్లు కేటాయించాలని అన్నారు. అన్ని పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. బీసీలకు న్యాయం చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, వంశీ చందర్ రెడ్డి, సంపత్ అందరూ ఓడిపోయారని.. వాళ్లకు మాత్రం వెంటనే టికెట్స్ ఇస్తున్నారన్నారు. బీసీ వర్గాలకు మాత్రం వెంటనే టిక్కెట్లు కేటాయించారా అని కత్తి వెంకటస్వామి ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos