పర్యాటక దినోత్సవాన మోదీని పరిహసించిన కాంగ్రెస్

పర్యాటక దినోత్సవాన  మోదీని పరిహసించిన కాంగ్రెస్

న్యూ ఢిల్లీ: ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ వరుస విదేశీ పర్యటనలు లక్ష్యంగా శుక్రవారం ట్విట్టర్లో పరిహసించింది. మోదీ విదేశీ పర్యటనల 18 ఫొటోల ఆల్బమ్ను ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు’అని ఎగతాళి చేసింది.ఆ ఫొటోల్లో చాలా వరకు మోదీ విమానం నుంచి దిగుతూ అభివాదం చేస్తున్నవి, సూట్ ధరించినవి, దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ధరించిన వస్త్రాలతో ఉన్న ఫొటోలూ ఉన్నాయి. 2014లో అధికారం చేపట్టిన తర్వాత 57 దేశాల్లో తిరిగారు. ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన పర్యటనలకు రెట్టింపు. మోదీ విదేశీ పర్యటనల వ్యయం రూ.2021 కోట్లు. ప్రస్తుతం మోదీ అమెరికా పర్యటనలో ఉండటం గమనార్హం.

తాజా సమాచారం