వాణిజ్య ప్రకటనల్లో సూపర్స్టార్ మహేశ్బాబు తెలుగు హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.ఇప్పటికే పదికిపైగా వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్న మహేశ్బాబు తాజాగా మరొక వాణిజ్య ప్రకటనలో దర్శనమిచ్చారు.ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ బైజు’స్(BYJU’S) తెలుగు రాష్ట్రాల వరకు ప్రచారకర్తగా మహేశ్బాబును ఎంపిక చేసుకుంది.అందుకు సంబంధించి యాప్ చీఈఓ మృణాల్ మోహిత్ మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లు ఎంతో కీలకంగా భావిస్తున్నామని యాప్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. యాప్పై తెలుగు విద్యార్థుల ఆసక్తిని గమనించి యాప్ను తెలుగు ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో మహేశ్బాబును ప్రచారకర్తగా ఎంపిక చేసుకున్నామన్నారు.యాప్ గురించి మహేశ్బాబు మాట్లాడుతూ..ప్రశ్నలు సంధించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని టెక్నాలజీ ఆధారిత విద్యాభ్యాసం పిల్లలకు సుదీర్ఘ కాలం పాటు గుర్తుంటు ఉంటుదని అందుకు BYJU’S ఆన్లైన్ లర్నింగ్ యాప్ ఎంతో సహాయకారిగా ఉండనుందన్నారు.ఇదే యాప్కు హిందీలో ఏడాది కాలంగా షారుఖ్ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..