చెన్నై: కరోనా వైరస్ చాప కింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తున్నందున ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ నుంచి వాహనాల రాకపోకలను ఈ నెల 31 వరకు నిలిపి వేయాలని తమిళ నాడు ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. నిత్యావసర వస్తువులు, అత్యవసర వైద్య సేవల వాహనాలను అనుమతిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారి కోసం అతి తక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతామని తెలిపింది. ప్రజలంతా సహకరించాలని పళనిస్వామి కోరారు