వెంకన్న దర్శనానికి రానున్న మోదీ

వెంకన్న దర్శనానికి  రానున్న మోదీ

గుంటూరు: దేశ ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ వెంకన్న దర్శనార్థం  ఈ నెల 9న తిరుమలకు వెళ్లనున్నారు. ఆ రోజు సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లి శ్రీ వారిని దర్శించుకుంటారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ శనివారం ఇక్కడ తెలిపారు. భాజపా శ్రేణులు ప్రధానికి ఘన స్వాగతం పలకాలని కన్నా విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమవుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos