బాంబు దాడికి ముగ్గురు బలి

బాంబు దాడికి ముగ్గురు బలి

ముర్షిదాబాద్ : ప్రత్యర్థులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మరణించారు. పశ్చిమ బంగ ముర్షిదాబాద్ జిల్లా, దోమకల్ పట్టణంలో శుక్రవారం రాత్రి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లపై దుండగులు బాంబులతో దాడి చేసారు. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఖైరుద్దీన్ షేక్, సోహెల్, రానాలు మరణించారు. కాంగ్రెస్ కార్యకర్తలే తమ ఇంటిపై దాడి చేసిన తన తండ్రిని చంపారని మృతుడు ఖైరుద్దీన్ కుమారుడు ఆరోపించారు. కొన్ని రోజుల కిందట తన మామయ్య అల్తాఫ్ హుసేన్ ను చంపారని చెప్పారు. ఈ దాడిలోనూ పలువురు గాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos