మరో ఇద్దరు ఉద్యోగులపై టిక్‌టాక్‌ వేటు

మరో ఇద్దరు ఉద్యోగులపై టిక్‌టాక్‌ వేటు

అనంతపురం : జిల్లాలోని కదిరి ప్రాంతీయ వైద్య శాలలో టిక్‌టాక్‌ చేస్తూ ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ల్యాబ్‌ టెక్నీషియన్లుగా పని చేస్తున్న శైలజ, సద్గుణ విధి నిర్వహణ సమయంలో టిక్‌టాక్‌ చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వైద్య శాల సూపరిండెంట్‌ వారిద్దరినీ విధుల నుంచి తొలగించారు. ఇటీవల కరీంనగర్‌లో టిక్‌టాక్‌లో నటించిన ముగ్గురు వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారం రోజులు గడవక ముందే అనంతపురం జిల్లాలో కూడా అలాంటి సంఘటనే జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos