పంటల త్యాగానికీ రైతులు సిద్ధం

పంటల త్యాగానికీ రైతులు సిద్ధం

చండిఘడ్ : చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ తేల్చి చెప్పారు. పంటల కోతకు తాము ఇంటికి వెళ్తామని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉందని, కానీ తమకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదన్నారు. ఇక్కడ జరిగిన కిసాన్ మహాపంచాయత్లో ఆయన ప్రసంగిం చారు. ‘ చేతికొచ్చే పంటలను సైతం త్యాగం చేయడానికి రైతులు సిద్ధంగా ఉండాలి. పంటను తగలబెట్టాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలి. సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు ఘర్ వాపసీ ప్రసక్తే లేద’ని కుండ బద్దలుగొట్టారు. హర్యానాలో మహాపంచాయత్ పూర్తయిన తర్వాత తమ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తికా యత్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మహాపంచాయత్లను నిర్వహిస్తామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos