న్యూ ఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర అంశాలపై చర్చ జరిగే వరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.కొత్త సాగు చట్టాల రద్దు ముసాయిదా లోక్సభ ఆమోదం పొందిన దరిమిలా ఈ ప్రకటన చేసారు. దేశంలో ఎలాంటి నిరసనలు జరగకుండా చూడాలని ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. కానీ, పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర వివిధ సాగు సమస్యలపై చర్చ జరిగేవరకు ఉద్యమ వేదికను వీడబోమని కుండ బద్ధలు కొట్టారు.