ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారం శుక్రవారం స్వల్ప లాభాలతో మొదలైంది. ఉదయం 9.53 గంటల వేళలో సెన్సెక్స్ 64 పాయింట్లు లాభపడి 40,979 వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు ఎగబాకి 12,043 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.18గా నమోదైంది. కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, హీరో మోటార్కార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, బ్రిటానియా షేర్లు లాభాల్ని పొందాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఐఓసీ, కోల్ ఇండియా విప్రో షేర్లు నష్ట పోయాయి.