కాంగ్రెస్‌కు 123, ఎన్సీపీకి 125

కాంగ్రెస్‌కు 123, ఎన్సీపీకి 125

ముంబై: రానున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ముగిసినట్లు మాజీ ముఖ్య మంత్రి పృథ్విరాజ్ చవాన్ బుధవారం ఇక్కడ  విలేఖరులకు తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో ఎన్సీపీ 125 స్థానాల్లో, కాంగ్రెస్ 123 స్థానాల్లో పోటీ చేయ నున్నాయి. మిగిలిన 41 స్థానాల్లో తమ కూటమిలోని చిన్న పార్టీలు పోటీ చేస్తాయని చెప్పారు. ‘ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహు జన్ అఘాడి, స్వాభిమాన్ షేట్కారి సంఘటన, సమాజ్వాదీ పార్టీ సహా మరిన్ని పార్టీలతో చర్చలు జరిపాము. వారికి 41 సీట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింద’ని పేర్కొన్నారు. ‘రాజకీయ పక్షాలు ప్రజా స్వామ్యానికి గుండె లాంటివి. ఇప్పుడవి తీవ్ర సంక్షో భంలో ఉన్నాయి. కొందరు దేశంలో ఏక పార్టీ పాలనకు ప్రయత్నిస్తున్నారు. అది అత్యవసర పరిస్థికి దారి తీస్తుంద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos