లాక్డౌన్ పార్టీ లో పాల్గొన్న భాజపాఎమ్మెల్యే

లాక్డౌన్ పార్టీ లో పాల్గొన్న భాజపాఎమ్మెల్యే

గోవా: పాలక పక్ష శాసన సభ్యుడు గ్లెన్ సౌజా టిక్లో ఒక విందులో పాల్గొనటం సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. వివాదాలకు తెర లేచింది. కరోనా పెరిగి నందున భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని, విందులు, విలాసాలకు ఉండాలని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రజలకు విన్నవించి ఒక్క రోజైనా గడవక ముందే టిక్లో పార్టీ విందుకు హాజరు కావటం వివాదాస్పదమైంది. ఆ వీడియో లో భాజపా కౌన్సిలర్ ఫ్రాన్సిస్కో కర్వాల్, కొందరు యువకులు ఒక హోటల్ గదిలో చేసుకున్నవిందుకు టిక్లో హాజరయ్యారు. ఆయనను చూసిన యువకుల్లో ఒకరు ‘ప్రత్యేక అతిథి వచ్చేశారు. లాక్డౌన్ పార్టీ’ అని గట్టిగా అరిచారు. పార్టీకి హాజరైన ఎమ్మెల్యే చేతులు ఊపుతూ, కరచాలనం చేశారు. ‘సన్నిహిత మిత్రుడొకరు పిలిస్తే పార్టీకి వెళ్లాను. అక్కడ నేనున్నది కొన్ని నిమిషాలే. అక్కడ ఉన్నంత సేపూ భౌలితిక దూరాన్ని పాటించా. విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నార’ని టిక్లో ఆగ్రహించారు. విందులో దాదాపు 40 మంది పాల్గొన్నారు. ఇదే పార్టీలో చిందేసిన కౌన్సిలర్ ఫ్రాన్సిస్కో మాట్లాడుతూ.. విందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించనున్నట్టు ప్రమోద్ సావంత్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos