టికెట్ల ధరల పెంపు అనివార్యం : దిల్‌రాజు

  • In Film
  • May 8, 2019
  • 118 Views
టికెట్ల ధరల పెంపు అనివార్యం : దిల్‌రాజు

హైదరాబాద్‌ : భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉండాలంటే థియేటర్‌ల యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచక తప్పడం లేదని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. రేపు విడుదల కానున్న మహేశ్‌ బాబు చిత్రం మహర్షి సినిమా టికెట్ల ధర పెంపు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సినిమా అంటేనే నాలుగు రోజుల ముచ్చటేనని, ఆ వ్యవధిలోనే పెట్టుబడిని రాబట్టుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకే తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలోనూ థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచాయని చెప్పారు. బాహుబలి లాంటి సినిమానే 50 రోజులు కూడా ఆడని పరిస్థితి నెలకొందని తెలిపారు. మహర్షి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల థియేటర్లలో విడుదల చేస్తున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos