శ్రీనగర్ : బారాముల్లాలో సోమవారం ఉదయం సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రవాడుల దాడిలో ఒక పోలీసు ఉన్నతాధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్నపుడు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో గాయపడిన వారిని ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.