హుషారుగా జెండా కడుతుండగా అంతలొనే..

హుషారుగా జెండా కడుతుండగా అంతలొనే..

జాతీయ జెండా ఎగురవేయడానికి వీలుగా ఇనుపరాడ్‌ అమర్చుతుండగా ప్రమాదవశాత్తు ఇనుపరాడ్డు విద్యుత్‌ తీగలకు తగిలి ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు.ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పవరం గ్రామానికి చెందిన విద్యార్థులు షేక్పఠాన్గౌస్‌, షేక్హసన్బుడే , పఠాన్‌ పంద్రాగష్టును ఘణంగా జరుపుకోవాలనే ఉత్సాహంతో కోదండరామ స్వామి ఆలయం వద్ద దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు.జెండా ఎగురవేయడానికి వీలుగా దిమ్మెల మధ్యలో ఇనుపరాడ్డు ఏర్పాటు చేస్తున్న క్రమంలో రాడ్డు విద్యుత్‌ తీగలకు తగిలి చిన్నారులు అక్కడికక్కడే మరణించారు.సమాచారం అందుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ముగ్గురు బాలల మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos