ఎదురు కాల్పుల్లో ముగ్గురు హతం

ఎదురు కాల్పుల్లో ముగ్గురు హతం

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య సంభవించిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు, వారితో సంబంధం ఉన్న మరో వ్యక్తి హతమయ్యాడు. అవంతిపొర సెక్టార్లోని గోరిపొర ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం శనివారం వేకువ జామున భద్రతా బలగాలతో కలిసి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అక్కడే నక్కి ఉన్న ముష్కరులు వీరిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇతర ఉగ్రవాదుల కోసం అక్కడ గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికార్లు విలేఖరులకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos