పలమనేరు లో ముగ్గురికి కరోనా

పలమనేరు లో ముగ్గురికి కరోనా

పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు లో ముగ్గురికి కరోనా వ్యాధి సోకినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ‘పలమనేరు పరిసరాల నుంచి కొందరు మార్చి 13 న ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన జమాత్ ప్రార్థనలకు కొందరు వచ్చారు. వీరంతా ఇక్కడి మసీదు వీధి, గంటా ఊరు ప్రాంతాలకు చెందినవారు. వారిలో ఇప్పటి వరకూ ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగింది. వీరిని మదర్ థెరిసా కళాశాలలోని ప్రత్యేక గదులలో ఉంచి చికిత్స చేస్తున్నారు. 56 మందిలో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకింద’ని వివరించారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos