కోల్కతా : తూర్పు మిడ్నపూర్ జిల్లా, భగవాన్పూర్ చర్చిపై బాంబులతో దాడి చేసి, అక్కడున్న కారును ధ్వంసం చేసారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్ధానిక భాజపా, సంఘ పరివార్ కార్యకర్తల్లో ఎనిమిది మంది ఈ దాడికి పాల్పడినట్లు పాస్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుండగులు తొలుత చర్చి ప్రాంగణంలో రెండు బాంబులు విసిరారు. ప్రార్ధనలు చేస్తున్నవారు భయంతో పరుగులు తీయగానే లోపలికి చొచ్చుకువచ్చి అక్క డు న్న కుర్చీలు, మేజాలు, టేబుళ్లు, కిటికీ గాజుల తలుపులు, మైక్రోఫోన్లను ధ్వంసం చేశారు. పదిహేను నిమిషాల పాటు విధ్వం సానికి పాల్పడి, అక్కడి నుంచి వెనుదిరిగారని పాస్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్చి పై దాడితో తమకు సంబంధం లేదని భాజపా జిల్లా నాయకత్వం తెలిపింది.