దొంగకు పళ్లు తినిపించి…

  • In Crime
  • August 22, 2019
  • 140 Views
దొంగకు పళ్లు తినిపించి…

జైపూర్ : మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ నుంచి సొత్తు స్వాధీనం చేసుకునేందుకు రాజస్థాన్ పోలీసులు కొత్త పద్ధతి అవలంబించారు. బికనేర్‌లోని గంగాషహర్ అనే ప్రాంతంలో బైక్‌పై వెళ్లిన ఇద్దరు దొంగలు ఓ మహిళ మెడలోంచి గొలుసును లాక్కుపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఆ దొంగ తెలివిగా గొలుసును మింగేశాడు. తాను ఎలాంటి బంగారం దొంగతనం చేయలేదని బుకాయించాడు. అయినా సీసీటీవీ ఫుటేజీలోని వ్యక్తి ఇతడే అని నిర్ధరించుకున్న పోలీసులు అతనిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. పొట్టలో బంగారు గొలుసు ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బయటకు తీసేందుకు ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు చెబుతూ, పోలీసులకు ఓ సలహా ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులు ఓ డజను అరటిపండ్లు, రెండు బొప్పాయిలను తెప్పించారు. వాటిని అతడితో బలవంతంగా తినిపించారు. ఈ ప్రయోగం ఫలించడంతో బుధవారం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos