ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు నగలు చోరీ

ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు నగలు చోరీ

హొసూరు : ఇక్కడికి సమీపంలోని మత్తిగిరి వద్ద దొంగలు ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 35 తులాల బంగారు నగలు, రూ 50 వేల నగదును దోచుకెళ్లారు. మంగళవారం ఈ సంఘటన వెలుగు చూసింది. మత్తిగిరి పోలీసుస్టేషన్ పరిధిలో గల అభిరామి గార్డెన్‌లో నివాసముంటున్న ప్రేమకుమార్ నివృత్త ప్రభుత్వ ఉద్యోగి. ఆయన భార్య గౌతమి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. దీపావళి పండుగకు వరుస సెలవులు రావడంతో దంపతులిద్దరూ బెంగళూరులో ఉంటున్న కొడుకు ఇంటికి వెళ్లారు. పండుగ ముగించుకొని మంగళవారం వారు హొసూరుకు వచ్చారు. ఇంటి తాళాలు పగులగొట్టిన ఉండడాన్ని చూసిన ప్రేమకుమార్ లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 35 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదు కనిపించలేదు. చోరీపై ఆయన మత్తిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos