ధోనీ ఇంట్లో చోరీ

  • In Crime
  • May 1, 2019
  • 135 Views
ధోనీ ఇంట్లో చోరీ

నోయిడా: మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి చెందిన ఇంట్లో దొంగతనం జరిగింది. సెక్టార్‌ 104 ప్రాంతంలో ఈ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఇటీవలే విక్రమ్‌ సింగ్ అనే వ్యక్తికి అద్దెకిచ్చారు. విక్రమ్‌ ఇంకా ఈ ఇంటికి రాలేదు. మరమ్మతులు చేయించాల్సి ఉండటంతో కూలీలను పెట్టి చేయిస్తున్నారు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో మూడు టీవీలకు గాను ఒక టీవీ చోరీకి గురైంది. విక్రమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కూలీ కన్పించట్లేదని, అతడే చోరీ చేసి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos