సాహోకు కాదు ప్రేక్షకులకు షాక్..

  • In Film
  • August 30, 2019
  • 81 Views
సాహోకు కాదు ప్రేక్షకులకు షాక్..

ప్రభాస్‌ నటించిన భారీ చిత్రం సాహో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుంచే షోలు మొదలయ్యాయి.కాగా ఆంధ్రప్రదేశ్‌లో అదనపు ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పెంపునకు మాత్రం నిరాకరించినట్లు వార్తలు వెలువడ్డాయి.దీంతో ప్రేక్షకులు సాధారణ ధరలతోనే సాహో చిత్రం చూసేయ్యొచ్చని సంబరపడి ఆన్‌లైన్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌లు,థియేటర్లకు వెళ్లగా టికెట్ల ధరలు చూసి షాక్‌ తిన్నట్లు తెలుస్తోంది.గత చిత్రాలకు రూ.100గా ఉన్న టికెట్ల ధరలు సాహో చిత్రం వచ్చేసరికి రూ.200కు పెరిగాయి.అయితే సాహో టికెట్ల పెంపు విషయంలో ఇప్పటికే సర్కారు నుంచి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి అధికారులపై ఒత్తిడి పెరిగినట్లు టాక్. అందుకే వారు టికెట్ల పెంపు గురించి ప్రస్తావిస్తే అదేమీ లేదు అంటూ నోటి మాట ద్వారా చెబుతున్నారే తప్పఅధికారిక ఉత్తర్వులు అయితే విడుదల చేయలేదు.టికెట్ ధరల పెంపు లేదు అంటున్న అధికారులు ఆన్ లైన్లో రేట్లు పెంచి దర్శనమిస్తున్న థియేటర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ ప్రశ్నిస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos