ఉద్ధవ్ ఠాక్రే చేజారిన థానే మున్సిపల్ కార్పొరేషన్

ఉద్ధవ్ ఠాక్రే చేజారిన థానే మున్సిపల్ కార్పొరేషన్

ముంబై : థానే మున్సిపల్ కార్పొరేషన్లోని శివసేనకు (ఉద్దవ్ వర్గం) చెందిన 66 మంది కార్పొరేటర్లు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరినట్లు సమాచారం. వారు కొత్త సీఎం ఏక్ నాథ్ షిండేను బుధవారం రాత్రి ఆయన నివాసంలో కలిసినట్లు తెలుస్తోంది. అయితే 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో ఉద్ధవ్ ఠాక్రే టీఎంసీపై అధికారాన్ని కోల్పోయారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ముఖ్యమైన పౌర సంస్థ. 18 మంది శివసేన ఎంపీల్లో 12 మంది త్వరలో షిండే నేతృత్వంలోని వర్గంలో చేరతారని శివసేన రెబల్ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos