ఇద్దరు ముష్కరులు హతం

ఇద్దరు ముష్కరులు హతం

శ్రీనగర్: రామ్బాగ్లో శుక్రవారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.రామ్బాగ్లో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రాత సిబ్బంది నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. అప్పుడు తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు.దీనికి ప్రతిగా భద్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు పాకిస్థాన్ ఉగ్రవాది కాగా మరొకరు స్థానిక లష్కరే తోయిబాకు చెందిన ముష్కరుడిగా అధికారులు గుర్తించారు. ఇటీవల నౌగామ్లో సీఆర్పీఎఫ్ దళాలపై జరిగిన దాడిలో వీరి పాత్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos