శ్రీనగర్ : పుల్వామా జిల్లా షార్షలీ గ్రామంలో బుధవారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది ఒకరు హతమయ్యారు. బుధవారం ఉదయం పోలీసులు భద్రతా బలగాల సాయంతో అక్కడ నిర్బంధ తనిఖీలు నిర్వహించినపుడు ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇతర ఉగ్రవాదుల కోసం గాలింపుల్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.