అధికారం కోసమే నితీశ్‌ రాజీ

అధికారం కోసమే నితీశ్‌ రాజీ

పాట్నా: అధికారంలో కొనసాగడం కోసమే బీహారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీపడి పౌరసత్వ చట్ట సవరణ ముసాయి దాకు మద్దతు తెలిపారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్ట ముసాయిదాకు బుధ వారం ఇక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘ఈ ముసా యిదాను తీసుకురావడం పెద్ద నాటకం. దీనికి మద్దతు తెలిపిన నితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం జేడీయూలో ఎవరికీ లేదు. అధికారంలో కొన సాగడం కోసమే నితీశ్ కుమార్ రాజీపడి, ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. అదిరాజ్యాంగ విరుద్ధం’అని మండిపడ్డారు. బీహార్ లో భాజపా మద్దతుతో జేడీయూ అధికారంలో ఉంది. ముసా యి దాకు నితీశ్ కుమార్ మద్దతిచ్చినందుకు జేడీయూ పార్టీలో అస మ్మతి చెలరేగినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos