బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం

బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం

జైపూరు : హాథ్రస్ ఘటనతో దేశమంతా ఆగ్రహ జ్వాలలతో నిండిపోయింది. మరిన్ని దారుణాలు బయటపడుతున్నాయి. రాజస్థాన్ చురూ జిల్లాలో దాదాపు నెలరోజులుగా కామాంధుల క్రూరత్వానికి ఓ 16 ఏళ్ల బాలిక బలైంది. సామూహిక అత్యాచారానికి గురైంది. గత సెప్టెంబర్ 6న మేకలను కాస్తున్న బాలికను నిందితుడు జీపులో వచ్చి అపహరించాడు. జిల్లాలోని మరో చోటుకు తీసుకువెళ్లి 20 నుంచి 25 రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి ఇంటికి చేరుకుంది. తర్వాత మహిళా పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి ఒడిగట్టేముందు తేనీటిలో మత్తు పదార్థాన్ని నిందితులు కలిపి తాగించినట్లు పేర్కొన్నారు. నిందితులపై భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసారు.నిందితుల కోసం గాలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos