ఉపాధ్యాయురాలి హతం

శ్రీనగర్:కుల్గాం జిల్లాలోని గోపాల్పుర ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిపై మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులు జరిపి, హత్య చేశారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కశ్మీరు జోన్ పోలీసులు ఇచ్చిన ట్వీట్లో తెలిపిన వివరాల ప్రకారం, ఉపాధ్యాయినిపై ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు సహోద్యోగులు ప్రయత్నించారు. కానీ ఆమె అప్పటికే ప్రాణాలు విడిచారు. ఈ టీచర్ స్వస్థలం జమ్మూ అని తెలుస్తోంది. ఉగ్రవాదులు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుండటం కొనసాగుతోంది. 2021లో ఈద్గా సంగం వద్ద సతీందర్ కౌర్, దీపక్ చంద్ అనే టీచర్లను కూడా ఉగ్రవాదులు హత్య చేశారు. ఇటీవల టీవీ నటి అమ్రీన్ భట్ను కూడా ఉగ్రవాదులు హత్య చేశారు. ఆమెను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos