తెదేపా నేతలతో వైకాపా సంప్రదింపులు

తెదేపా నేతలతో వైకాపా సంప్రదింపులు

అమరావతి: గెలిచే అవకాశాలున్న తెదేపా అభ్యర్థులతో వైకాపా నేతలు సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆరోపించారు.గురువారం ఇక్కడి నుంచి పార్టీ ప్రముఖులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. కర్ణాటక భాజపా నేతల రాజకీయ అక్రమాల్ని బయటపెట్టినట్లు ఇక్కడా వైకాపా కుట్రలను బహిర్గతం చేయాలని సూచించారు. తెదేపా తిరిగి అధికారంలోకి రానున్నదని దీమా వ్యక్తీకరించారు. రాజకీయ నిఘా పై దృష్టి వోట్ల లెక్కింపు దగ్గర పడుతున్న కొద్దీ తెరాసా గొంతు మారిందని, భాజపా చాలా బలహీనమైందని విశ్లేషించారు. వైకాపా మానసికి స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కృషి చేస్తోందని అభిప్రాయపడ్డారు. వోట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వోట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లే ప్రతినిధులకు సాంకేతికపై అవగాహన కల్పించాలని కోరారు. ఆ రోజు కూడా వైకాపా కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos