మాజీ మంత్రి,ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య బుధవారం ఉదయం హఠాన్మరణం చెందారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి 1994, 1999లో బ్రహ్మయ్య వరుసగా రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో బ్రహ్మయ్యను ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మయ్య మరణం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు..