హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యల పరిష్కారానికి మడమ తిప్పని పోరాటాన్ని సాగిస్తామని తెలుగుదేశం పార్టీ అగ్రనేతల్లో ఒకరైన రావుల చంద్రశేఖర రెడ్డి శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ప్రజా పోరాటాల్ని సాగిస్తూనే రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యల్ని చేపడతామని చెప్పారు. అంతకు ముందు ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రముఖులు దివాకరరెడ్డి, ఎల్. రమణ తదితరులతో కలసి ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిస్థితుల గురించి సమీక్షించారు.