గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం

గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజభవన్లో ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ కొత్త గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించారు.ఆదివారం ఉదయం చెన్నై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తమిళిసై అక్కడి నుంచి హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర మంత్రులు కొత్త తమిళిసైకి స్వాగతం పలికారు.అనంతరం పోలీసులు గౌరవ వందనం చేశారు.తమిళిసై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తదితర మంత్రులు హాజరయ్యారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos