కాబూల్ : ఇద్దరు జర్నలిస్టుల బాధాకరమైన చిత్రాలు చూసిన తర్వాత అఫ్ఘానిస్తాన్పై ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనకు మరింత బలం చేకూరుతోంది. పశ్చిమ కాబూల్లోని కార్ట్ ఏ చార్ ప్రాంతంలో బుధవారం జజరిగిన మహిళల ర్యాలీని కవర్ చేసిన విలేఖరి నేమత్ నఖ్దీ, వీడియో ఎడిటర్ తాకి దర్యాదీ ని తాలిబన్లు చిత్ర హింసలకు గురి చేసారు. గాయాలు, రక్తపు ధారలతో ఇద్దరు వారి శరీరం నిండి పోయింది. ఊతంతోనూ నవడలేని స్థితిలో ఉన్నవారిని చూసిన నెటిజెన్లు ఆందోళన వ్యక్తం చేసారు.