మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

హైదరాబాదు:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారెంటీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్బంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభంకాబోతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం పట్ల మహిళల నుంచి పెద్ద ఎత్తున హర్ష్యం వ్యక్తమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos