లోక్‌ సభ ఎన్నికల్లో బిజెపి ఒంటరి పోరాటం

లోక్‌ సభ ఎన్నికల్లో బిజెపి  ఒంటరి  పోరాటం

హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో ఇతర పక్షాలతో పొత్తులుండ బోవని, ఒంటరి పోరాటాన్నిసాగిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఆయన ముఖ్యనేతలు జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్ లు, పార్లమెంట్ బాధ్యులు తదితరలతో ఈ సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos