న్యూ ఢిల్లీ : ఇక్కడి చారిత్రక రామ్లీలా మైదానంలో ఫిబ్రవరి 16(ఆదివారం)న ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణాన్ని చేయనున్నారు. కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం గురించి చర్చించారు. బుధవారం సాయంత్రం ఇక్కడ జరగనున్న ఆప్ శాసన సభా పక్ష సమావేశం కేజ్రీవాల్ను నేతగా ఎన్నుకోనుంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు కేజ్రీవాల్ లాంఛనంగా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కోరతారు. నిబంధనల ప్రకారం ప్రమాణానికి ముందు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.