బిగ్బాస్ షోపై యాంకర్ శ్వేతారెడ్డి రోజురోజుకు ఆరోపణల,విమర్శలు మోతాదును పెంచుతున్నారు.తాజాగా షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జునపై శ్వేతారెడ్డి విరుచుకుపడ్డారు.నాగార్జునకు సామాజిక బాధత్య లేదా..? అంటూ ప్రశ్నించింది. అమల జంతువుల కోసం స్పందిస్తున్నప్పుడు ఇంతమంది అమ్మాయిల ఆరోపణలపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. టాస్క్ ల పేరుతో కంటెస్టంట్ లను మానసికంగా హింసిస్తున్నారని.. దమ్ముంటే అమలను, సమంతను బిగ్ బాస్ షోకి పంపించండి అంటూ సవాల్ విసిరింది.‘మన్మథుడు 2′ సినిమా ప్రమోషన్స్ పై చూపిస్తున్న ఆసక్తి నాగార్జున మా ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ఫైర్ అయింది. నాగార్జున తమ ఉద్యమాన్ని నీటి బుడగ అంటున్నారని.. ఓయూ విద్యార్ధులకు నాగార్జున ఓ గాలి బుడగ అని కామెంట్స్ చేసింది శ్వేతారెడ్డి. నాగార్జున ఒక రోజు మీ భార్య అమలను, కోడలు సమంతను బిగ్ బాస్ హౌస్ లో ఉంచి డబ్బులు సంపాదించండి అంటూ మండిపడింది. తప్పు చేయకపోతే బయటకొచ్చి స్పందించాలని.. నాగార్జున దొంగలా ఎందుకు దాక్కుంటున్నారని ప్రశించింది. హౌస్ లో అందరినీ జంతువులుగా బంధించి హింసిస్తున్నారని.. నాగార్జునపై మండిపడ్డారు..